సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై ఎస్ తనయ షర్మిల, తెలంగాణాలో కొత్త పార్టీ ప్రారంభంలో భాగంగా ఖమ్మం లో రేపటి తోలి బహిరంగ సభలో ( కోవిద్ నిబంధనల మేరకు పోలీసులు 5వేలమందిని మాత్రమే అనుమతించనున్నారు.) కొత్త పార్టీ గురించి ఏమి మాట్లాడతారో అని? అని తెలుగు ప్రజలు ఎదురు చేసుతున్నారు. రేపు శుక్రవారం సుమారు 500 కార్లతో లోటస్ పాండ్ నుంచి ప్రారంభం కానున్న ర్యాలీ లకిడీకాపూల్, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, హయత్నగర్, చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట్, నాయకన్గూడెం మీదుగా ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్స్కు చేరుకోనుంది. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్నపటికీ సంకల్ప సభకు షర్మిల తల్లి హోదాలో, విజయమ్మ వస్తున్నారని పార్టీ ముఖ్య నేత ఇందిరా శోభన్ వెల్లడించారు. షర్మిల పార్టీ రేపటి నుండి తెలంగాణ రాష్ట్రం రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషించనుందో? ఎలా నెగ్గుకురాగలదో చూడాలి..
|