సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: కర్ణాటక రాష్ట్రంలో నేడు, శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్ వ్యానును టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ వ్యానులో ప్రయాణిస్తున్న 11మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
|