సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం రామాలయం వీధిలో నేడు, తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. తల్లీ, కూతురు ఉరేసుకున్నారు. మృతులను సంగిరెడ్డి కృష్ణవేణి (55), కూతురు శివపావని (27), నిషాంత్ (9), రితిక (7)లుగా గుర్తించారు. కుటుంబకలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. శివ పావని భర్త ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడమే ఘటన కు కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంకా పూర్తీ వివరాలు వారి దర్యాప్తులో వెల్లడికావలసి ఉంది.
|