సిగ్మాతెలుగు డాట్ కామ్, న్యూస్: ఈ వేసవిలో భీమవరం పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మునిసిపల్ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎం ఈ ప్రసాద్, డి ఇ రాజారావుతో ఆయన తాగునీటిపై జరిపిన సమీక్షలో మంచినీటి ఎద్దడి లేకుండా చేప్పట్టవలసి చర్యలు, ప్రస్తుత వేండ్ర వద్ద మంచినీటి ట్యాంక్ లో, స్థానిక రిజర్వాయర్లు లో ఉన్న నీటి నిల్వలు, వాటి వినియోగం షెడ్యూలు, అలాగే పట్టణ శివారు ప్రాంతాలకు నీటి సరఫరా, పలు అపార్ట్మెంట్స్ లో మోటారు ల ద్వారా నీటిని తోడేస్తున్న వారిపై తీసుకొంటున్న చర్యలు, వృధా నీటి వినియోగం నిలుపుదల తదితర విషయాలు వారితో చర్చించారు.