సిగ్మాతెలుగు డాట్ కామ్ న్యూస్: ఉత్తర్ప్రదేశ్లో నేడు, శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా- మొరాదాబాద్ హైవేపై మూడు వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. హుసేన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందార్కి సమీపంలో బస్సు- ట్రక్కు ఢీకొనగా.. రెండింటి మధ్య మరో వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో, దారి సరిగ్గా కనపడక ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ విషయం గురించి మొరాదాబాద్ ఎస్ఎస్పీ మాట్లాడుతూ.. రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు